మా గురించి

నమస్తే!

భాష పదికాలాల పాటు నిలవాలి అంటే ఆ భాషలో సాహిత్యం వెలువడుతూనే ఉండాలి. రాసే  వాళ్ళే కాదు చదివే వాళ్ళు కూడా కావాలి.  ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో పత్రికలు వెలువడ్డాయి. కొన్ని నిలిచాయి, కొన్ని తెరమరుగయ్యాయి. కానీ ఇప్పుడు కోవిడ్ 19 మహమ్మారి దెబ్బకు ప్రింటులో వస్తున్న చాలా పత్రికలు కనుమరుగయ్యాయి.

నేటి కాలానుగుణంగా పాఠకులు అంతర్జాలంలో కథలు చదవడానికి సుముఖంగా వున్నారు. కానీ కథలు, సీరియళ్లు, విద్య, వైద్య వంటి అనేక రంగాల గురించి, మహిళలకు, పిల్లలకు, పెద్దలకు చదువుకోవడానికి కావలసిన నాణ్యమైన రచనలు ఒకే చోట దొరికే సావకాశం ఇంతవరకూ లేదు. ఆ లోటుని భర్తీ చేస్తూ మీ ముందుకి వచ్చింది సహరి డిజిటల్ మాగజైన్స్ . ఇందులో వీక్లీ తో  పాటు మంత్లీ కూడా ఉంది. 
ఇది అంతర్జాలంలో తొలి  సమగ్ర వీక్లీ మరియు మంత్లీ .

మీ అందరి  ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము.

 జులై 2021 లో మొదటి వార్షికోత్సవం సందర్భంగా పూర్తి నవలను అందిస్తూ సహరి మాసపత్రికను కూడా అందించడం ప్రారంభించాం.

అశేష తెలుగు పాఠకులకు సహరి అభిమాన పత్రిక అయినందుకు గర్వంగా ఉంది. ఈ విజయం మనందరిదీ. పాఠకులు, పత్రికలు, రచయితలు ముగ్గురూ   చక్కటి సమూహంగా ఏర్పడిననాడే భాష పరిపుష్టం అవుతుంది. అది సాధించించడంలో మీ సహకారం మరువలేనిది. 

 త్వరలో సహరి సమగ్ర వార పత్రిక 200 వ సంచిక కు చేరుకోబోతోంది. ఆ అద్భుతాన్ని సాధ్యం చేసిన మీ అందరికీ శిరసా నమామి. 

 మీ ఉత్తమాభిరుచికి సహరి గీటురాయి

 మీరు ఇచ్చే ప్రోత్సాహంతో తెలుగు పాఠకులకు, రచయితలకు కూడా అందుబాటులో ఉండే చక్కటి సమగ్ర వార పత్రిక గా నిలిచి సదా ప్రకాశించాలని కోరుతూ వుంది మీ సహరి. మీ ఆశీస్సులు ఆకాంక్షిస్తుంది మీ సహరి. ఆదరిస్తారు కదూ!

మీ
సహరి 
అంతర్జాలంలో తొలి సమగ్ర తెలుగు వీక్లీ మరియు మంత్లీ