1965 లో మొదలైన రచన ప్రస్థానం ఏ ప్రత్యేకతా, అలజడీ లేకుండా అరవై యవ పడి అలవోకగా దాటిపోయింది.
ఈ అరవై ఏళ్లలోనూ నాలుగు వందలకి పైగా రచనలు నా పేరుకి జత పడ్డాయి. అచ్చు పడ్డాయి.
పి . వి .ఆర్ . శివకుమార్
పుట్టింది 1951 లో. పెరిగింది విజయవాడలో.
వృత్తి రీత్యా మెకానికల్ ఇంజనీర్. ఎచ్. ఎం. టి. లో 30 ఏళ్ల సర్వీస్ తరవాత, ఏ. జి.ఎం. గా ఐచ్ఛిక పదవీ విరమణ. ఆ తరవాత ఒక ప్రైవేట్ కంపెనీ, వాక్యూమ్ టెక్నిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో చేరి, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుత నివాసం ముంబాయి.
“1965 లో మొదలైన రచన ప్రస్థానం ఏ ప్రత్యేకతా, అలజడీ లేకుండా అరవై యవ పడి అలవోకగా దాటిపోయింది.
ఈ అరవై ఏళ్లలోనూ నాలుగు వందలకి పైగా రచనలు నా పేరుకి జత పడ్డాయి. అచ్చు పడ్డాయి. ఇందులో అత్యధికంగా కథలూ, కాసిని నవలలూ, కొద్దిపాటి వ్యాసాలూ, వ్యాసార్ధాలూ, సితారలో సినిమా సమీక్షలూ .. రేడియోలో కథలు, నాటికలు, ప్రసంగాలతో పాటుగా వెదజల్లిన పూల జల్లులూ.. ఇలాగ అనేక రకాలు.
రచయితకి అరవై నిoడుతుండగా అయిదవ కథల సంపుటి, “ అవ్యక్త రాగం” వెలువర్చాను.
ఇన్నాళ్లలో రాసిన మూడు వoదల పైచిలుకు కథలతో పదుగురి నోళ్లలో రాతగాడిగా నానాను. 51 కథలకి వివిధ పత్రికల పోటీలలో బహుమతులు వచ్చాయి. అయితే, ఎందరి గుండెల్లో వీటిలో ఏ ఒక్క కథయినా కొన్నాళ్లపాటైనా చోటు చేసుకున్నదో లేదో తెలియదు. అలా చేసుకుని ఉంటే సంతోషమే.