మహ్మద్ అఫ్సర్ వలీషా
కవయిత్రి, రచయిత్రి
నా పేరు మొహమ్మద్ అఫ్సర వలీషా ద్వారపూడి తూర్పు గోదావరి జిల్లా.నేను కవయిత్రిని, రచయిత్రిని. వారు డాక్టర్. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు మనవరాళ్ళు. నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం, గౌరవం. 2010 నుండి కథలు వ్రాసే దాన్ని. నా మొదటి కథ 2010 లో ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రింట్ అయింది. విపుల లో కూడా నా కథ వచ్చింది. కవితలు చాలా ఇష్టంగా నేర్చుకొని వ్రాస్తున్నాను.చాలా ఆన్లైన్ పత్రికలలో నా కథలు కవితలు ప్రింట్ అయ్యాయి. 200 పైగా జాతీయ, రాష్ట్రీయ అంతర్జాతీయ పోటీలలో నా కథలు, కవితలు బహుమతి పొంది అవార్డులు వచ్చాయి. అద్దేపల్లి ,గురజాడ పురస్కారాలు లభించాయి.