జ్యోతి మువ్వల
Poet& writer
జ్యోతి మువ్వల గారు విశాఖపట్నం జిల్లాలో అక్టోబర్ 16న జన్మించారు. తల్లిదండ్రులు కిల్లాడ అప్పారావు గారు (రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్), యశోద గారు (స్టీల్ ప్లాంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్). ఐదుగురు సంతానంలో ఐదవ సంతానం.
విశాఖపట్నంలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన జ్యోతి గారు, ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారు.
ఆమె భర్త జానకిరామ్ గారు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి. వారికి ఒక కుమారుడు దివ్యాన్షు.
సాహిత్య ప్రయాణం
పాఠశాల దశలోనే చిన్న చిన్న కొటేషన్లు రాయడం ద్వారా రచనా ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె రాసిన కొటేషన్లు "QuotationAdda.com"లో ప్రచురింపబడ్డాయి. తల్లి ప్రోత్సాహంతో సాహిత్యంపై ఆసక్తి పెంచుకుని, కవిత్వంలో అడుగుపెట్టారు. ఆమె రాసిన తొలి కవిత “అమ్మ”.
వివాహానంతరం కొంతకాలం రచనకు విరామం వచ్చినా, భర్త ప్రోత్సాహంతో మళ్లీ కవిత్వాన్ని ప్రారంభించారు. కరోనా కాలంలో పత్రిక ప్రకటనల ద్వారా ప్రేరణ పొంది సాహిత్యరంగంలో మరింత చురుకుగా మారారు.
📚 రచనలు
జ్యోతి గారు ఇప్పటివరకు వివిధ ప్రక్రియల్లో విస్తృతంగా రచనలు చేశారు:
300 పైగా కవితలు
50 కథలు
20 పుస్తక సమీక్షలు
100 సప్తపదులు
50 పైగా హైకూలు