దామరాజు విశాలాక్షి
రచయిత్రి కవయిత్రి సాహితీవేత్త
గత 55 సంవత్సరాలుగా నా సాహితీ ప్రయాణం సాగుతోంది. తెలుగులో వివిధ రచనా ప్రక్రియలు చేయడం నా అలవాటు. వివిధ దినపత్రికలు వారపత్రికలు మాస పత్రికలలో నా కథలు కవితలు వ్యాసాలు వంటివి ప్రచురింపబడ్డాయి 40 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తి బాల సాహిత్యం పట్ల మక్కువ నువ్వు ఎక్కువ చేసింది.సుమారు పాతిక వరకు బాలల నాటికలు రాశాను. ప్రదర్శింప చేశాను. బాల కడలి ముత్యాల జల్లు అనే బాలల గేయ సంపుటాలను ప్రచురించాను. విసాలాక్షి కథానికల పేరుతో ఒక కథల పుస్తకం ప్రచురించాను. జాతీయ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నాను. వివిధ విశ్వవిద్యాలయాలలో పత్ర సమర్పణలు చేశాను. సాహితీ ప్రసంగాలు వివిధ వేదికలపై చేశాను. పుస్తక సమీక్షలు చేస్తున్నాను. అమెరికా కెనడా వారి తెలుగు పత్రికలలో నా కవితలు వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వారి సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేశాను. ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారాలు అందుకున్నాను. ఆనాటి మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ గారిచే ప్రశంసా పత్రాన్ని పొందాను. పలు సంస్థలచే సన్మానాలు సత్కారాలు పొందాను. వివిధ పత్రికలలో నా రచనలు వస్తున్నాయి ఆకాశవాణిలో నా కథలు కవితలు ప్రసంగాలు ప్రసారం అవుతున్నాయి.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో నా కథలు ప్రసారమయ్యాయి. సువిసాలమైన సాహితీ క్షేత్రంలో నా రచనలు అనే కొన్ని విత్తనాలు నాటుకొని పెంచి పెద్ద చేయాలి అని కోరిక. సహరి పత్రికతో చాలా కాలం క్రిందటనుండి నాకు అనుబంధం ఉంది. అత్యుత్తమమైన సాహితీ విలువలు గల ఆత్మీయమైన పత్రిక సహరి.