దామరాజు విశాలాక్షి
రచయిత్రి కవయిత్రి సాహితీవేత్త
.Damaraju Visalakshi: రచయిత్రి వివరాలు…
నా పేరు విశాలాక్షి దామరాజు. విశ్రాంత ఉపాధ్యాయని. సుమారు 40 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను.
కథలు కవితలు వ్యాసాలు సమీక్షలు పాటలు నాటికలు బుర్రకథలు, పద్యాలు, గేయాలు వంటి సాహిత్య ప్రక్రియలు చేస్తూ ఉంటాను.
బాల సాహిత్యంలో
బాల కడలి ,ముత్యాల జల్లు అనే రెండు పుస్తకాలు ప్రచురించాను..
“విశాలాక్షి కథానిక లు"
పేరుతో కథా సంపుటి ప్రచురితమైనది .
ఉత్తమ ఉపాధ్యాయునిగా సన్మానాలు పొందాను.
గురజాడ సేవా రత్న అవార్డు ,
నారం శెట్టి వారి బాల సాహిత్య పురస్కారం,
గిడుగు రామ్మూర్తి పంతులు గారి తెలుగు సాహిత్య పురస్కారం, వంటి అనేక పురస్కారాలు పొందాను.
ఆంధ్ర విశ్వవిద్యాలయం, మద్రాస్ తెలుగు విశ్వవిద్యాలయం, వంగూరి ఫౌండేషన్ అమెరికా వారి సదస్సులు,
అఖిల భారత సాహిత్య పరిషత్తు,కెనడాతెలుగు తల్లి వంటి వాటిలో ప్రసంగవ్యాసాలు ,
పత్ర సమర్పణలు చేశాను.
నా రచనలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణిలో ప్రసారమయ్య
నా కథ అనేక యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చాయి. కెనడా తెలుగు తల్లి వారి సదస్సులలో,కెనడా కథావేదిక కవితా వేదికలలో పాల్గొంటున్నాను...
సాహిత్య ప్రవీణ బిరుదు పొందాను.*