పసుపులేటి సత్యశ్రీనివాస్
'నువ్వు రాసిన కథలు పత్రికలలో వస్తే చదవాలని వుంది' అన్ని అమ్మ అన్న మాట నాలో కథలు రాయాలన్న ఆలోచన కలిగించింది.
స్వాతి, నవ్య, ఆంధ్రభూమి పత్రికలలో కథలు, సీరియల్స్, ఈనాడు, ఆంధ్రప్రభ సండే మాగజైన్స్లో కథలు ప్రచురించబడ్డాయి. 2020 జులై 31 న శ్రీ గొర్లి శ్రీనివాసరావు గారితో కలిసి ప్రారంభించిన "అంతర్జాలంలో తొలి సమగ్ర వార పత్రిక" సహరి వార, మాస పత్రికలకు, బాలసహరి ప్రింట్ పత్రికకు మానేజింగ్ ఎడిటర్ గా వున్నాను. సహరిలో కథలు, సీరియల్స్, ఆధ్యాత్మిక వ్యాసాలు, గృహశోభ ఆర్టికిల్స్ ప్రస్తుతం నా రచనలు.