సింహ ప్రసాద్
Story and novel writer, playwright
నా సాహిత్య ప్రస్థానం 1973 లో ప్రారంభమైంది. ఇంతవరకు 577 కథలు, 76 నవలలు, 9 నాటకాలు రాశాను. వాటిలో 175 కథలకు, 24 నవలలకు, 9 నాటకాలకు, కొన్ని కవితలకు బహుమతులు పొందాను .
ఇవేగాక వివాహవేదం, తిరుమల దివ్యక్షేత్రం, శ్రీరాముడి ధర్మపథం గ్రంథాలకు ప్రముఖుల ప్రశంసలు పొందాను .51 కథలు, 4 నవలలు, వివాహ వేదం ఇతర భాషల్లోకి అనువదింపబడినవి.
ఇంత వరకు నా రచనలు 70 పుస్తకాలుగా విడుదలయ్యాయి.
అమృతలత జీవన సాఫల్యపురస్కారం, ఉషా పత్రికల లైఫ్ టైంఅచీవ్మెంట్ అవార్డు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం,
కథాఋషి మునిపల్లె రాజు సాహిత్య పురస్కారం
కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం ,
ఆంధ్ర సారస్వత సమితి (మచిలీపట్నం) వారి సాహిత్య ప్రతిభా పురస్కారం
నాగభైరవ పురస్కారం (ఒంగోలు)
సోమేపల్లి సాహితీ పురస్కారం
కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారం
యువ ‘చక్రపాణి’ అవార్డ్
దేవరకొండ బాల గంగాధర తిలక్ స్మారక కథా పురస్కారం (భీమవరం)
నవ తెలంగాణ వారి వట్టికోట ఆళ్వారు స్వామి స్మారక అవార్డ్
స్వాతి అనిల్ అవార్డ్ - నవలలకు ( 6 సార్లు)
నోముల కథా పురస్కారం (నల్గొండ)
విశ్వ సాహితి త్యాగరాయ గానసభ వారి ఉగాది పురస్కారం
నవ తెలంగాణ వారి దాశరధి రంగాచార్య స్మారక అవార్డ్
ఆంధ్ర భూమి -నాటా (అమెరికా) వారి అంతర్జాతీయ కథలపోటీలో పురస్కారం
డా. పట్టాభి కళాపీఠం వారి కథా పురస్కారం (విజయవాడ)
పుప్పాల ఫౌండేషన్ వారి కథా పురస్కారం ( కాకినాడ)
డా. జయప్రద సోమిరెడ్డి నవలా పురస్కారం ( నెల్లూరు)
శ్రీ దత్త సాంస్కృతి సంస్థ వారి సాహిత్య పురస్కారం
ఇండియన్ బ్యాంక్ రెటైరీల సంఘం (ఆంధ్ర, తెలంగాణ) వారి ఉగాది పురస్కారం మొదలైన ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాను