కంచనపల్లి వేంకట కృష్ణారావు
పేరు కంచనపల్లి వేంకట కృష్ణారావు పుట్టింది 1954 నెల్లూరులో. B.Sc నెల్లూరులో వి.ఆర్. కాలేజీలో చదివాను. రాలీస్ ఇం.లి.ఫార్మా డివిజన్లో రీజినల్ మేనేజరుగా పదవీ విరమణ చేసాను. 1978 నుండి కథలు, వ్యాసాలు వ్రాస్తున్నాను.సుమారు 300కథలు వ్రాసాను ఇంకా రాస్తున్నాను. సుమారు 70 వ్యాసాలు ప్రచురింపబడ్డాయి.అప్పుడప్పుడు కవితలు వ్రాస్తుంటాను. 1980 లో కొన్ని కార్టూన్ లు కూడా వేసాను. 2011లో తానా వారు నిర్వహించినబాలల నవలల పోటీలో నా బాలల నవల 'మామయ్యతో కిట్టూ సాహస యాత్ర' పదివేలరూపాయల బహుమతి గెలుచుకుంది. సహరి మొదలగు పత్రికలలో నా కథలు ప్రచురింప బడుతున్నాయి. నాశ్రీమతి గృహిణి. మా అబ్బాయి, కోడలు హైదరాబాదు లో ఆర్కిటెక్ట్ లు.మా అల్లుడు సాఫ్ట్ వేర్ ఇంజనీరు.ఒక బాలల నవల వ్రాయాలనుకుంటున్నాను 30 పెయింటింగులు వేసాను.