సింగీతం విజయలక్ష్మి
Poet & story writer
నా పేరు *సింగీతం విజయలక్ష్మి*. తల్లిదండ్రులు బాపూరం గురురాజ రావు గారు & చంద్రకాంత బాయి.
అన్న గారు నరహరి రావు బాపురం, తమ్ముడు రఘునాథ రావు బాపురం, చెల్లెలు వినుతా గాయత్రి.
పుట్టి పెరిగింది అనంతపురంలో.
చదువు : B.A , B.Ed, హిందీ ప్రవీణ
ఉద్యోగం : *1990 నుండి 1996 వరకు ఉపాధ్యాయురాలిగా పనిచేశాను.*
1996 జనవరిలో సింగీతం ఘటికాచలరావు గారితో వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు ప్రద్యుమ్న రావు, ప్రద్యోత రావు
2013లో భర్త ప్రోత్సాహంతో నేను వ్రాసిన 'కర్మణ్యే వాధికారస్తే' అనే మొట్టమొదటి కథ *నవ్య* వార పత్రికలో ప్రచురించ బడింది. ఆ తరువాత అంతర్జాల వార పత్రికలలో కొన్ని కథలు ప్రచురించ బడ్డాయి. మరి కొన్ని కథ
కు బహుమతి లభించింది. భర్త, అన్నయ్య ప్రోత్సాహంతో కవితా సాహిత్యం మీద మక్కువ ఏర్పడి ఎన్నెన్నో కవితలు వ్రాసాను. పలుమార్లు పలురకాల పోటీలలో విజేతనయ్యాను. సాహిత్య రంగంలో ఉన్నత మజిలీలు చేరుకోవాలని అన్ని సాహిత్య ప్రక్రియలు ఇంకా బాగా వృద్ధి చేసుకోవాలని నా ఆకాంక్ష.