వైరాగ్యం ప్రభాకర్
కవి, రచయిత, విమర్శకులు, సంపాదకులు
పేరు:వైరాగ్యం ప్రభాకర్
విశ్రాంత ఉపాధ్యాయులు,కవి, రచయిత, విమర్శకులు.సంపాదకులు
అధ్యక్షులు భవానీ సాహిత్య వేదిక కరీంనగర్.
భార్య: వైరాగ్యం లక్ష్మీ భవాని
సంతానం:
కుమార్తె అల్లుడు కచ్చు మానస హరీష్
మనుమరాలు సమన్విత
కుమారుడు : వైరాగ్యం సాయి తేజ
నా సాహిత్య ప్రస్థానం:
కవిగా, రచయితగా, విమర్శకులుగా 14 పుస్తకాలు రచించారు.భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ వ్యవస్థాపక అధ్యక్షులుగా కవిత ,కథా, వ్యాస,గేయ ప్రక్రియలతో పాటు వ్యంజకాలు, మెరుపులు,మణిపూస లు,చమక్కులు సాహిత్య రూపాల్లో 140 పుస్తకాలు ప్రచురించాను.ముమ్మార్లు శతాధిక కవి సమ్మేళనాలు నిర్వహించి కవులను ఘనంగా సత్కరించాను.నా సంపాదకత్వంలో వెలువడిన సంకలనాలలో రచనలు చేసిన కవులు నేడు సాహిత్య రంగంలో మంచి పేరు తెచ్చుకున్న వారెంరదరో... భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో ఇటు కరీంనగర్ లో అటు హైదరాబాద్ లోను అరవైకి పైగా పుస్తకావిష్కరణ సభలు నిర్వహించాను.పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు,సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు వారాల ఆనంద్ గారు,దాసరి వెంకటరమణ గారు ,నందిని సిధారెడ్డి గారు, మరియు డా.ఏనుగు నరసింహారెడ్డిIAS గారు,జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ IAS గారు,నాళేశ్వరం శంకరం గారు ,కాంచనపల్లి గోవర్ధన్ రాజు గారు, ఆచార్య ఫణీంద్ర గారు,సాదనాల వెంకట స్వామి నాయుడు గారు,దాస్యం సేనాధిపతి గారు లాంటి ప్రముఖులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి పుస్తకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాను.